నీలగిరి, జూన్ 12 : అంతర్రాష్ట్ర దొంగను అరెస్ట్ చేసి 16తులాల బంగారం, 40తులాల వెండిని రికవరీ చేసినట్లు నల్లగొండ డీఎస్పీ వెంకటేశ్వర్రెడ్డి తెలిపారు. శనివారం నల్లగొండ టూటౌన్ పోలీస్స్టేషన్లో నిందితుడి వివరాలను వెల్లడించారు. విజయవాడలో నివాసముంటూ కూలీ పనులు చేసుకునే తిమ్మసముద్రం శివ అలియాస్ వంశీ, నంద, నందు వరుస దొంగతనాలకు పాల్పడుతున్నాడు. లాక్డౌన్ విధి నిర్వహణలో భాగంగా టూటౌన్ పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన శివను అదుపులోకి తీసుకుని విచారించగా పలు దొంగతనాలకు పాల్పడినట్లు ఒప్పుకున్నాడు. శివ స్వస్థలం అనంతరం జిల్లా కల్యాణదుర్గం మండలం ఈస్ట్ కొడేపల్లి. జిల్లాలోని నల్లగొండ వన్టౌన్, రూరల్, టూటౌన్ పోలీస్స్టేషన్ల పరిధిలో శిపై ఆరు కేసులు నమోదై ఉన్నట్లు డీఎస్పీ తెలిపారు. సీఐ చంద్రశేఖర్రెడ్డి, ఎస్ఐ నర్సింహులు, సిబ్బంది శంషొద్దీన్, శంకర్, బాలకోటిని అభినందించారు.