వరంగల్ రూరల్ : పట్టణ ప్రగతితో పట్టణాల రూపురేఖలు మారిపోతాయని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. నర్సంపేటలో పట్టణ ప్రగతి కార్యక్రమంపై అవగాహన సదస్సుకు హాజరై మాట్లాడారు. పట్టణ ప్రాంతాలు చాలా పరిశుభ్రంగా, చక్కని పారిశుధ్యం, పచ్చదనంతో రూపొందాలన్నారు. పట్టణ ప్రాంతాల ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పర్చేందుకు ప్రభుత్వం పట్టణ ప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు.
పట్టణ పౌరులు ఉత్తమ సేవలను పొందడానికిగాను ప్రాణాళికబద్ధమైన ప్రగతి జరగాలని అన్నారు.
పట్టణ ప్రగతిలో ప్రజలు చురగ్గా పాల్గొనాలని ఎమ్మెల్యే తెలిపారు. హరిత ఉద్యాన వనాల ఏర్పాటు చేయాలని చెప్పారు. సమీకృత మార్కెట్ వద్ద సరైన పద్ధతిలో క్రమం తప్పకుండా పారిశుధ్య పనులు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో నర్సంపేట మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ చైర్ పర్సన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, స్పెషల్ ఆఫీసర్లు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
వెదజల్లే పద్దతిలో వరి సాగుతో అధిక లాభాలు : మంత్రి హరీశ్ రావు
బైక్ అదుపుతప్పి కల్వర్టులో పడి వ్యక్తి మృతి
పల్లెప్రగతి పనులను పరిశీలించిన మంత్రి వేముల
వనపర్తి జిల్లాలో నూతన కోర్టులు ప్రారంభం
ల్యాబర్తిలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే ఆరూరి