బాలానగర్, జూన్ 3 : ఓల్డ్బోయిన్పల్లి డివిజన్ సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నట్లు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. గురువారం ఓల్డ్బోయిన్పల్లి డివిజన్ పరిధిలోని హస్మత్పేట చెరువు అభివృద్ధి పనులను స్థానిక కార్పొరేటర్ ముద్దం నర్సింహయాదవ్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హస్మత్పేట బోయిన్ చెరువు సుందరీకరణ పనులను చేపట్టినట్లు తెలిపారు. చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్ నిర్మాణ పనులు చురుకుగా కొనసాగుతున్నాయని తెలిపారు. రూ. 1కోటి 19 లక్షల నిధులతో నూతన వంతెన పనులు చేపట్టినట్లు తెలిపారు.లాక్డౌన్ సందర్భంగా ర్యాంపు పనులకు జాప్యం ఏర్పడిందని. త్వరలోనే ఆ పనులను పూర్తిచేసి వంతెనను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. అనంతరం కార్పొరేటర్ నర్సింహయాదవ్ మాట్లాడుతూ.. చెరువు సుందరీకరణ పనులు పూర్తి అయితే చెరువు మినీ ట్యాంక్బండ్గా పేరు గాంచుతుందని తెలిపారు. కార్యక్రమంలో నరేందర్గౌడ్, కర్రె జంగయ్య, మక్కల నర్సింగ్, ఇర్ఫాన్, ఉదయ్ యాదవ్, డీఈ గోవర్ధన్గౌడ్, ఏఈ అరవింద్ స్థానికులు తదితరులు పాల్గొన్నారు.