రాజపత్రం విడుదలచేసిన రాష్ట్ర ప్రభుత్వం
హైదరాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ): విరసం (విప్లవ రచయితల సంఘం)తో సహా రాష్ట్రంలో 16 మావోయిస్టు అను బంధ సంఘాలపై ఉన్న నిషేధాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎత్తివేసింది. ఆయా సంఘాలను నిషేధిస్తూ మార్చి 30న ఇచ్చిన ఉత్తర్వులను రద్దుచేస్తూ మంగళవారం రాజపత్రం విడుదల చేసింది. నిషేధం తొలగించిన ప్రజాసంఘాల జాబితాలో విప్లవ రచయితల సం ఘం (రెవెల్యూషనరీ రైటర్స్ అసోసియేషన్), తెలంగాణ ప్రజా ఫ్రంట్ (టీపీఎఫ్), తెలంగాణ అసంఘటిత కార్మిక సమాఖ్య (టీఏకేఎస్), తెలంగాణ విద్యార్థి వేదిక(టీవీవీ), డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్(డీఎస్యూ), తెలంగాణ విద్యార్థి సంఘం(టీవీఎస్), ఆదివాసీ స్టూడెంట్స్ యూనియన్ (ఏఎస్యూ), కమిటీ ఫర్ రిలీజ్ ఆఫ్ పొలిటికల్ ప్రిజనర్స్, తెలంగాణ రైతాంగ సమితి, తుడుందెబ్బ, ప్రజా కళామండలి, తెలంగాణ డెమోక్రటిక్ ఫ్రంట్, ఫోరం ఎగైనెస్ట్ హిందూ ఫాసిజమ్ అఫెన్సివ్, సివిల్ లిబర్టీస్ కమిటీ, అమరుల బంధుమిత్రుల సంఘం, చైతన్య మహిళా సంఘం ఉన్నాయి