హన్మకొండ చౌరస్తా, మే 5: ప్రొఫెసర్ జయశంకర్ సార్ సోదరుడు కొత్తపల్లి వాసుదేవరావు(96) బుధవారం కన్నుమూశారు. హన్మకొండ చౌరస్తాలోని ఆయన నివాసంలో ఉదయం 11 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయన ఎక్సైజ్శాఖలో ఇన్స్పెక్టర్గా పనిచేసి రిటైర్ అయ్యారు. జయశంకర్ సార్కు అన్న వాసుదేవరావు, తమ్ముడు, చెల్లెలు ఉన్నారు. తమ్ముడు ప్రస్తుతం అమెరికాలో, చెల్లెలు హన్మకొండలో ఉంటున్నారు. వాసుదేవరావుకు భార్య సరోజ, ముగ్గురు కుమారులు, కూతురు ఉన్నారు. వాసుదేవరావు మృతికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సంతాపం తెలిపారు. కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులు పెద్దఎత్తున తరలివచ్చి నివాళులర్పించారు.