హైదరాబాద్, జూలై 30 (నమస్తే తెలంగాణ): జాతీయ న్యాయ సేవాధికార సంస్థ (ఎన్ఎల్ఎస్ఏ) సభ్యురాలిగా తెలంగాణకు చెందిన ఉస్మానియా ప్రొఫెసర్ బీనా చింతలపూరి నియమితులయ్యారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఆమోదం తెలపటంతో శుక్రవారం ఆమె నియామకంపై కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. ఉస్మానియా యూనివర్సిటీలో సైకాలజీ విభాగం ప్రొఫెసర్గా, మొదటి మహిళా రిజిస్ట్రార్గా పనిచేసిన బీనా.. జైళ్లు, ఖైదీలకు సంబంధించి సంసరణలకు ఎనలేని కృషి చేశారు. ఆమె సేవలకు ప్రపంచంలోనే ప్రతిష్ఠాత్మకమైన అమెరికాకు చెందిన అశోక అవార్డు లభించింది. సీనియర్ న్యాయవాదులు మీనాక్షి అరోరా, కేవీ విశ్వనాథన్, సిద్ధార్థ లూధ్రతో పాటు సామాజిక కార్యకర్త ప్రవీణ్ పాటర్ ఎన్ఎల్ఎస్ఏ సభ్యులుగా నియమితులయ్యారు.