రాష్ట్రంలో కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమానికి ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్ (పీఅండ్జీ) సంస్థ రూ.5 కోట్ల విరాళం అందజేసింది. బుధవారం ప్రగతిభవన్లో పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావుకు కంపెనీ ప్రతినిధులు చెక్కును అందజేశారు. పీ అండ్ జీ సురక్షా ఇండియా కార్యక్రమం కింద దేశంలో పది లక్షల వ్యాక్సిన్ డోసులు అందించాలని సంకల్పించామని, ఇందులో భాగంగా రాష్ట్రంలో వ్యాక్సిన్ల కోసం రూ.5 కోట్లు అందించినట్టు కంపెనీ హైదరాబాద్ ప్లాంట్ హెడ్ సచిన్శర్మ తెలిపారు. దీంతోపాటు ఫ్రంట్లైన్ వర్కర్లకు మాస్కులు, శానిటైజర్లు అందించనున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో పరిశ్రమలశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్రంజన్ తదితరులు పాల్గొన్నారు.