పరిగి, మే 21 : పరిగిలో పటిష్టంగా లాక్డౌన్ అమలవుతున్నది. లాక్డౌన్ సడలింపు సమయాల్లోనే ప్రజలు తమకు అవసరమైన నిత్యావసరాలు, కూరగాయలు కొనుగోలు చేస్తున్నారు. ఉదయం 10 గంటలకు పావుగంట ముందు నుంచే దుకాణాలు మూసివేసి వ్యాపారులు సైతం లాక్డౌన్కు సహకరిస్తున్నారు. దీంతో పరిగి పట్టణంలోని ప్రధాన రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. లాక్డౌన్ సమయంలో రోడ్లపైకి వచ్చే వాహనాలను పోలీసులు తనిఖీ చేస్తున్నారు. అనవసరంగా బయటకు వస్తే వారిపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటున్నారు.
పెద్దేముల్లో..
పెద్దేముల్, మే 21: మండల కేంద్రంతోపాటు ఆయా గ్రామాల్లో పకడ్బందీగా లాక్డౌన్ అమలు జరిగింది. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు వివిధ వ్యాపార సంస్థలు, ఇతర దుకాణ సముదాయాలు తెరుచుకున్నాయి. ఉదయం 10 గంటల తరువాత అనవసరంగా రోడ్లపైకి వచ్చిన వాహనాలను నిలిపి పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఆయా గ్రామాల్లో ఎస్సై చంద్రశేఖర్ ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షించారు. ఏఎస్సై నారాయణ, ఇతర పోలీసు సిబ్బంది తాండూరు-సంగారెడ్డి ప్రధాన రోడ్డు మార్గంలో నిబంధనలపై అవగాహన కల్పించారు. అనవసరంగా రోడ్లపైకి వస్తే వాహనాలు సీజ్ చేసి కేసులు నమోదు చేస్తామని ఎస్సై చంద్రశేఖర్, ఏఎస్సై నారాయణ హెచ్చరించారు. వాహనాల తనిఖీల్లో కానిస్టేబుళ్లు బాల్రాజ్గౌడ్, ప్రశాంత్, ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
లాక్డౌన్ను సక్రమంగా అమలు చేయాలి
కులకచర్ల, మే 21: లాక్డౌన్ నిబంధనలు సక్రమంగా అమలు పర్చాలని సీఐ లక్ష్మిరెడ్డి అన్నారు. శుక్రవారం కులకచర్ల మండల కేంద్రంలో లాక్డౌన్ అమలు తీరును ఎస్సై విఠల్రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాక్డౌన్ మార్గదర్శకాలను ప్రజలు తప్పనిసరిగా పాటించేవిధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. సీఐ వెంట ఎస్సై విఠల్రెడ్డి, పోలీసు సిబ్బంది ఉన్నారు.