బన్సీలాల్పేట్, జూలై 28: ప్రాథమిక ఉపాధ్యాయ సంఘం-తెలంగాణ, నూతన కార్యవర్గాన్ని బుధవారం పద్మారావునగర్లోని రాష్ట్ర కార్యాలయంలో ఎన్నుకున్నారు. అఖిల భారత ప్రాథమిక ఉపాధ్యాయుల సమాఖ్యకు అనుబంధంగా పనిచేస్తున్న ఈ సంఘానికి 2021-23 సంవత్సరానికిగాను అధ్యక్షుడిగా వైఎస్శర్మ (కరీంనగర్), ప్రధాన కార్యదర్శిగా పీ పార్థసారథి (నల్లగొండ) ఎన్నికయ్యారు. ఆర్థిక కార్యదర్శిగా డీ నాగేశ్ (సిద్దిపేట), కార్యనిర్వాహక అధ్యక్షులుగా కే శారద (హైదరాబాద్), డీ వాసుదేవరావు (నిజామాబాద్), అసోసియేట్ అధ్యక్షుడిగా మహ్మద్గౌస్, ఉపాధ్యక్షులుగా ఏ సురేందర్రెడ్డి (హైదరాబాద్), ఎస్ గోపి (సూర్యాపేట), షాహీన్సుల్తానా, ఉప ప్రధాన కార్యదర్శులుగా ఏ మనోహర్, నఫీజా, కార్యనిర్వాహక కార్యదర్శులుగా బీ సత్యనారాయణ, ఎం చంద్రారెడ్డి, సీహెచ్ సుధాకర్, పీ శ్రీను, పీ జ్ఞానేశ్వర్, ఆర్ భిక్షం, జీ యాకూబ్రెడ్డి, పరిపూర్ణాచారి, పీ రామలింగంను ఎన్నుకున్నారు. ముఖ్య సలహాదారుడిగా కేఎస్ ప్రకాశ్రావు, సలహాదారులుగా ఆర్ బెంజమిన్, ప్రసన్నకుమార్, డీ దామోదర్, కేజే వెంకటేశ్వర్రావు, పీ విక్రమ్బాబు, ఎస్ఏ జలీల్ వ్యవహరిస్తారని ప్రధాన కార్యదర్శి తెలిపారు.