సిటీబ్యూరో, మే 22 (నమస్తే తెలంగాణ): తెలుగు చిత్రపరిశ్రమకు ప్రభుత్వం అండగా ఉంటుందని పశు సంవర్ధక, మత్య్స, సినిమాటోగ్రఫి శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ప్రతినిధులు మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ను వెస్ట్మారేడ్పల్లిలోని తన నివాసంలో కలిశారు. వారి సమస్యలను వివరిస్తూ వినతిపత్రాన్ని అందజేశారు. క్లిష్ట పరిస్థితుల్లో ప్రభుత్వం అండగా నిలుస్తున్నదని.. ప్రస్తుతం రెండో దశ లాక్డౌన్లో సినీ కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. వారిని ఆదుకోవాలని మంత్రిని కోరారు. ఆర్టిస్ట్లందరికి వ్యాక్సిన్ వేయించాలన్నారు. ఇందుకు మంత్రి తలసాని సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అధ్యక్షుడు అనిల్కుమార్, సెక్రెటరీ కాదంబరి కిరణ్ పాల్గొన్నారు.