హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ): రామప్పకు యునెసో గుర్తింపు నేపథ్యంలో ఆ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలని టీఆర్ఎస్ ఎంపీల బృందం.. కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్రెడ్డికి విజ్ఞప్తిచేసింది. రామప్ప అభివృద్ధికి రూ.250 కోట్లతో ప్యాకేజీ కేటాయించాలని కోరింది. భద్రాచలం రాములవారి దేవాలయాన్ని ప్రసాద్ సీమ్లో చేర్చాలని విన్నవించింది. ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసీ గిరిజన జాతర సమ్మక్క-సారలమ్మ ప్రాంతాన్ని టూరిజం హబ్గా అభివృద్ధి చేయాలని కోరింది. ఎంపీలు బండా ప్రకాశ్, రంజిత్రెడ్డి, కొత్త ప్రభాకర్రెడ్డి, మాలోత్ కవిత, బడుగుల లింగయ్యయాదవ్, పసునూరి దయాకర్, వెంకటేశ్ నేతకాని ఈ మేరకు బుధవారం ఢిల్లీలో కిషన్రెడ్డికి వినతిపత్రం అందజేశారు.
భారత అంతరిక్షరంగంలో పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్ షిప్ (పీపీపీ) విధానం ద్వారా ప్రైవేటు భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తున్నారా అని టీఆర్ఎస్ లోక్సభా పక్షనేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు బుధవారం లిఖితపూర్వకంగా ప్రశ్నించారు. దేశంలో సాంకేతికత అభివృద్ధి, ఉపగ్రహాల తయారీ, ప్రయోగాల కోసం ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం నెలకొల్పడం చట్టబద్ధమైన విధానమని కేంద్ర సైన్స్అండ్ టెక్నాలజీ, అంతరిక్షశాఖ సహాయ మంత్రి జితేంద్రసింగ్ తెలిపారు.
చేవెళ్ల లోక్సభ నియోజకర్గం పరిధిలోని దుర్గంచెరువు, గండిపేట, హిమాయత్సాగర్ ప్రాంతాలతోపాటు వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి హిల్స్, కోట్పల్లి రిజర్వాయర్లను పర్యాటకంగా అభివృద్ధి చేయాలని ఎంపీ రంజిత్రెడ్డి.. కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్రెడ్డిని కోరారు. దీనికి కిషన్రెడ్డి సానుకూలంగా స్పందించారు.
నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లిలో విమానాశ్రయాన్ని ఏర్పాటుచేయాలని రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేశ్రెడ్డి.. కేంద్ర పౌరవిమానయానశాఖను కోరారు. కొత్త విమానయాన చట్టంపై జరిగిన చర్చలో పాల్గొన్న ఆయన.. కొత్త చట్టానికి మద్దతిస్తున్నట్టు ప్రకటించారు.