ప్రావిడెండ్ ఫండ్.. వివిధ సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగులు, సిబ్బంది రిటైర్మెంట్ తర్వాత జీవనం సాగించడానికి దీర్ఘ కాలిక పెట్టుబడి మార్గం.. అయితే, దీనిపై వచ్చే వడ్డీ ఆదాయం మీద పన్ను వసూలు చేయ సంకల్పించారు కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్.
గత ఫిబ్రవరి ఒకటో తేదీన ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2021-22) బడ్జెట్ ప్రతిపాదనలు సమర్పిస్తూ.. పీఎఫ్ కంట్రిబ్యూషన్ ఏడాదిలో రూ.2.5 లక్షలు దాటితే.. ఆ మొత్తంపై వచ్చే వడ్డీపై పన్ను విధిస్తామని పేర్కొన్నారు.
తొలుత ప్రకటించిన ప్రతిపాదన ప్రకారం ఒక సంస్థ యాజమాన్యం, ఉద్యోగి సంయుక్తంగా ఉద్యోగి ఖాతాలో జమచేసే పీఎఫ్ రూ.2.5 లక్షలు దాటితే.. దానిపై వచ్చే వడ్డీకి పన్ను వర్తిస్తుంది. సాధారణ ప్రజలకు రిటైర్మెంట్ ఫండ్గా ఉపకరించే పీఎఫ్లో కొందరు వ్యక్తిగతంగా పన్ను మినహాయింపు కోసం భారీగా ఇన్వెస్ట్ చేయకుండా నిలువరించేందుకే కేంద్రం ఈ నిబంధనను తెచ్చింది.
చట్ట ప్రకారం ఉద్యోగి వేతనంలో ఉద్యోగితోపాటు యాజమాన్యం చెరో 12 శాతం పీఎఫ్ ఖాతాలో జమ చేయాల్సి ఉంటుంది. గతేడాది మార్చి వరకు యాజమాన్యాల కంట్రిబ్యూషన్ 12 శాతానికి పన్ను మినహాయింపు ఉండేది. ఒకవేళ 12 శాతం దాటితే మాత్రం పన్ను వసూలయ్యేది.
2020 బడ్జెట్ ప్రతిపాదనల ప్రకారం ప్రావిడెండ్ ఫండ్ లేదా నేషనల్ పెన్షన్ సిస్టమ్/ సూపర్న్యూమరేషన్ ఫండ్ రూ.7.5 లక్షలు దాటితే, దానిపై వచ్చే వడ్డీ మీద పన్ను వసూలవుతుంది. కనుక అధిక ఆదాయం సంపాదిస్తున్న ఉద్యోగులందరికీ ఈ పన్ను నిబంధన వర్తిస్తుంది. తాజా సవరణ వల్ల ఉద్యోగుల పీఎఫ్ ఖాతా మీద వచ్చే వడ్డీపై విస్తృత ప్రభావం పడుతుంది.
తాజా చట్ట సవరణ ప్రకారం.. ఉద్యోగి వేతనం రూ.40 లక్షలు అంతకంటే ఎక్కువ ఉంటే పీఎఫ్పై వడ్డీకి పన్ను వసూలు చేస్తారు. రిటర్న్స్ ఎక్కువగా ఉండటంతోపాటు జీరో ట్యాక్స్, ఐదేండ్లు దాటిన తర్వాత ఉద్యోగి విత్డ్రాయల్ చేసుకోవడానికి నిబంధనలు అనుకూలంగా ఉండటంతో చాలా మంది ఉద్యోగులు స్వచ్ఛందంగా భారీ మొత్తంలో పీఎఫ్ ఖాతాలో జమచేస్తున్నారు.
కనుక ఎక్కువ మొత్తంలో పీఎఫ్ ఖాతాలో స్వచ్ఛందంగా జమ చేస్తున్న వారి ఆటలు ఇక సాగవు. కనుక స్వచ్చందంగా పీఎఫ్ ఖాతాలో ఎక్కువ మొత్తంలో డిపాజిట్లు తగ్గుతాయని భావిస్తున్నారు. ఉద్యోగులు జమ చేసే మొత్తంతో సమానంగా యాజమాన్యాలు జమ చేయని పీఎఫ్ ఖాతాలకు మాత్రమే ఈ నిబంధన వర్తిస్తుంది.
తాజా నిబంధన పరకారం ఈ నెలలో ఉద్యోగులు తీసుకునే శాలరీలో ఈ నిబంధన ప్రభావం కనిపిస్తుంది. ఉద్యోగి మాత్రమే పీఎఫ్ ఖాతాలో కంట్రిబ్యూట్ చేసినా.. రూ.5 లక్షల వరకు పన్ను మినహాయింపు ఉంటుందని గత నెలలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ క్లారిటీ ఇచ్చారు.
పీఎఫ్ ఖాతాలో జమ చేసిన వారిలో 92-93 శాతం మంది ఉద్యోగులు రూ.2.5 లక్షల్లోపే లబ్ధి పొందుతారని నిర్మలా సీతారామన్ చెప్పారు. ఉదాహరణకు మీరు రూ.2.5 లక్షలకు పైగా పీఎఫ్ ఖాతాలో జమ చేసుకున్నారనుకోండి.. ఆ పై మొత్తానికి వచ్చే వడ్డీపై పన్ను వర్తింపచేస్తారు.
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్, హీరోయిన్ భూమికి కరోనా
కళ్లు చెదిరే రీతిలో రాజస్థాన్ రాయల్స్ కొత్త జెర్సీ లాంచ్.. వీడియో
తప్పు నాదే.. డీకాక్ది కాదు: ఫకర్ జమాన్
కొవిడ్తో హాస్పిటల్లో చేరిన బాలీవుడ్ సింగర్
ఇదేం క్రీడాస్ఫూర్తి.. ఫకర్ జమాన్ను డీకాక్ మోసం చేశాడా.. వీడియో