పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్రపతి

తిరుపతి : తిరుచానూరు పద్మావతి అమ్మవారిని ఇవాళ ఉదయం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కుటుంబ సభ్యులతో కలసి దర్శించుకున్నారు. రాష్ట్రపతి వెంట రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఉన్నారు. తిరుమల పర్యటనలో భాగంగా ఇవాళ ఉదయం తిరుపతి విమానాశ్రయం చేరుకున్న ఆయన పద్మావతి అమ్మవారి దర్శనార్దం తిరుచానూరు ఆలయం వద్దకు చేరుకున్న రాష్ట్రపతి దంపతులకు టిటిడి చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి, జెఈవో పి.బసంత్కుమార్, ఆగమ సలహాదారులు శ్రీనివాసాచార్యులు, అర్చక బృందంతో కలిసి ఇస్తికఫాల్ స్వాగతం పలికారు.
అమ్మవారి దర్శనానంతరం వస్త్రం, తీర్థప్రసాదాలను వారికి చైర్మన్ అందించారు. కార్యక్రమంలో చిత్తూరు జిల్లా కలెక్టర్ భరత్ నారాయణ గుప్తా, ఇంటెలిజెన్స్ ఐజి శశిధర్ రెడ్డి, టిటిడి సివిఎస్వో గోపినాథ్ జెట్టి, తిరుపతి అర్బన్ ఎస్పీ రమేష్రెడ్డి, అదనపు సివిఎస్ వో శివకుమార్రెడ్డి, విజివో మనోహర్, డిప్యూటీ ఈవో ఝాన్సీరాణి తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- రోజు విడిచి రోజు నీరు: ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్
- బాలల పరిరక్షణకు చర్యలు
- మౌలిక వసతుల కల్పనకు కృషి
- రేణుకా ఎల్లమ్మదేవి కల్యాణ మహోత్సవం
- లాఠీ..సీటీతో చెత్తపై సమరం!
- ఏప్రిల్ 13 నుంచి భద్రాద్రి రామయ్య బ్రహ్మోత్సవాలు
- ఓటుహక్కు ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత
- కొత్త బార్లకు ప్రభుత్వం అనుమతి
- శ్రీవారి సర్వదర్శనం టోకెన్లు 20 వేలు
- రేపు ఉద్యోగులతో త్రిసభ్య కమిటీ భేటీ?