హఫీజ్పేట్, మే24, : లాక్డౌన్ను కఠినంగా అమలుచేస్తున్నామని సీపీ సజ్జనార్ అన్నారు. సోమవారం ఆల్విన్క్రాస్రోడ్డు, మియాపూర్ రోడ్డులో పర్యటించారు. లాక్డౌన్ను కట్టుదిట్టంగా అమలుచేయాలని స్థానిక పోలీసులకు సూచించారు. పలు వాహనాలను ఆపి తనిఖీలు నిర్వహించారు. రోడ్లమీదకు వచ్చేవారు తగిన ఆధారాలు చూపకుంటే కేసులు నమోదుచేస్తామని హెచ్చరించారు. ట్రాఫిక్ డీసీపీ విజయ్కుమార్, అదనపు డీసీపీ మాణిక్రాజ్, ట్రాఫిక్ సీఐ సుమన్, మియాపూర్ సీఐ వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.
బడంగ్పేట, మే 24 : లాక్డౌన్ నిబంధనలు పాటించకుండా బయటకు వస్తే.. కేసులుపెడుతామని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ హెచ్చరించారు. బాలాపూర్ పరిధిలోని శివాజీ చౌక్ వద్ద ఆయన స్వయంగా వాహనాలను తనిఖీ చేశారు. ఐడీ కార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ అత్యవసరం అయితేనే బయటకు రావాలని, ప్రజలంతా పోలీసులకు సహకరించాలని కోరారు. రోడ్లపైకి వచ్చేవారు తప్పనిసరిగా పాస్ చూపించాలని తెలిపారు. కార్యక్రమంలో బాలాపూర్ సీఐ భాస్కర్, పోలీసులు ఉన్నారు.