హైదరాబాద్ : కరీంనగర్కు తలమానికంగా నిలిచే మానేరు రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు సన్నాహక సమావేశం శనివారం జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు కేటీఆర్, గంగుల కమలాకర్, శ్రీనివాస్గౌడ్, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, కరీంనగర్ మేయర్ సునీల్ యాదగిరి, మున్సిపల్శాఖ ప్రధాన కార్యదరశి అరవింద్కుమార్, కరీంనగర్ కలెక్టర్ శశాంక, సంబంధితశాఖల అధికారులు పాల్గొన్నారు.
గుజరాత్ సబర్మతి రివర్ ఫ్రంట్ తరహాలో మానేరు రివర్ ఫ్రంట్ను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో భాగంగా మానేరు రివర్ ఫ్రంట్ (ఎంఆర్ఎఫ్)కు రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులను మంజూరు చేసింది. రూ. 310.464 కోట్లు విడుదల చేస్తూ శుక్రవారం జీవో జారీ చేసింది. ఈ జీవో కాపీని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావు రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్కు అందజేశారు.