దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి
సారంగాపూర్, జూన్ 7: సీఎం కేసీఆర్ సాగునీటి రంగానికి అధిక ప్రాధాన్యమిస్తున్నారని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం స్వర్ణ-జౌళి గ్రామాల మధ్య రూ.90 లక్షలతో నిర్మించిన లోలెవల్ కాజ్వే బ్రిడ్జిని సోమవారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇంద్రకరణ్రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రాజెక్టులకు కోట్లాది రూపాయలు వెచ్చించి మరమ్మతులు చేపడుతున్నట్టు చెప్పారు. ఈ నెల 15 నుంచి రైతుబంధు నగదు నేరుగా రైతుల ఖాతాల్లో జమ అవుతుందని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన ప్యాకేజీ 27 కాల్వ నిర్మాణం పూర్తయితే ఆయకట్టు కింద ఉన్న భూములకు రెండు పంటలకు పుష్కలంగా నీళ్లు ఉంటాయని మంత్రి పేర్కొన్నారు.