హైదరాబాద్, జూలై 30 (నమస్తే తెలంగాణ): ఉద్యమకారులను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సముచితంగా గౌరవిస్తున్నారని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధిశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. ఉద్యమంలో చురుగ్గా వ్యవహరించినవారికి తప్పక గుర్తిం పు ఉంటుందని చెప్పారు. ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్గా బండా శ్రీనివాస్ శుక్రవారం మాసబ్ట్యాంక్లోని సంక్షేమభవన్లో పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు మంత్రి కొప్పుల ఈశ్వర్, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్కుమార్, తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్, ప్రభుత్వ విప్ బాలసుమన్ తదితరులు అభినందనలు తెలిపారు. అనంతరం మంత్రి కొప్పుల మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ జ్ఞాపకశక్తి చాలా గొప్పదని, ఉద్యమం లో, పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించే వారందరినీ గుర్తు పెట్టుకున్నారని.. సమ యం వచ్చినప్పుడు వారందరికీ సముచితస్థానం కల్పిస్తారని తెలిపారు. దళితుల అభ్యున్నతికి దేశంలోనే ఎవరూచేయని సాహసం చేస్తున్నారని, దళిత బంధు పథకం ద్వారా ఎస్సీల సమగ్రాభివృద్ధి జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ మాట్లాడుతూ.. దళితులకు కేటాయించిన నిధులను పూర్తిగా వారికే వినియోగించాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్ సబ్ప్లాన్ చట్టం తీసుకువచ్చారని తెలిపారు. తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్ మాట్లాడుతూ.. దళిత బంధు వంటి పథకం ప్రపంచంలో మరెకడా లేదని, రూ.10 లక్షల నగదుతో దళితులు స్వయంగా అభివృద్ధి చెందుతారని తెలిపారు. మాజీమంత్రి పెద్దిరెడ్డి, టీఆర్ఎస్ నాయకులు సమ్మిరెడ్డి, అక్బర్ హుస్సేన్, కృష్ణమోహన్రావు, పొనుగంటి మల్లయ్య, గెల్లు శ్రీనివాస్ యాదవ్ తదితరులు బండా శ్రీనివాస్క్కు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేషన్ ఎండీ కరుణాకర్, జీఎం ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.