అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని విశాఖ జిల్లా కొయ్యూరు మండలం తీగమెట్ట వద్ద గ్రేహాండ్స్ దళాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు కీలక నేత మృతి చెందారు. డీసీఎం (Deputy Commander for Maintenance) కమాండర్గా కొనసాగుతున్న సందె గంగయ్య పోలీసు కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారు. సందె గంగయ్య స్వస్థలం తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గుంపుల గ్రామం. ఈ ఎన్కౌంటర్లో మొత్తం ఆరుగురు మావోయిస్టులు మరణించినట్లు సమాచారం ఉంది. దట్టమైన అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్ జరగడంతో వివరాలు బయటకు వచ్చేందుకు ఆలస్యమవుతున్నది. ఈ ఎన్కౌంటర్తో మన్యంలో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలినట్లయ్యింది. పలువురు కీలక మావోయిస్టు నేతలు ఘటనాస్థలం నుంచి తప్పించుకున్నట్లు పోలీసులకు సమాచారం ఉండటంతో హెలికాఫ్టర్ సాయంతో కూంబింగ్ నిర్వహిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.