ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్
చేర్యాల/కొమురవెల్లి, ఆగస్టు 24: సీఎం కేసీఆర్ పాలనలో కులవృత్తులకు పూర్వవైభవం వచ్చిందని ఎక్సైజ్శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ స్పష్టంచేశారు. సీఎం కృషితోనే ప్రతి జిల్లాకేంద్రం లో గౌడభవనాలు నిర్మిస్తున్నామని చెప్పారు. సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలం ఐనాపూర్, కొమురవెల్లి, రసూలాబాద్, గౌరాయపల్లి గ్రామాల్లో గౌడ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాలను ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ నాగపురి రాజలింగంగౌడ్, గౌడ జన హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు అమరవేణి నర్సాగౌడ్తో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా కొమురవెల్లిలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. కింగ్ ఆఫ్ ఏషియాగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చరిత్ర ఇంగ్లాండ్లోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో భద్రపరిచి ఉన్నదన్నారు. హైదరాబాద్లో గౌడ భవనం కోసం 5 ఎకరాల భూమిని కేటాయించారని, రూ.350 కోట్లతో ప్రారంభించనున్న పనులకు ఇటీవలే టెండర్లు పూర్తి చేశామన్నారు.