ఎమ్మెల్యేలు జోగు రామన్న,రాథోడ్ బాపురావ్
ఆదిలాబాద్లో రాంజీగోండ్ వర్ధంతి సభకు హాజరు
ఎదులాపురం, ఏప్రిల్9 : దేశ స్వాతంత్య్ర ం కోసం పోరాడి అమరులైన మహనీయుల ఆశయాలను సాధించే దిశగా ప్రతి ఒక్కరూ పాటు పడాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని బస్టాండ్ ఎదుట గిరిజనుల ఆరాధ్య దైవంగా కొలిచే రాంజీ గోండ్ 164వ వర్ధంతి కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు గాఎమ్మెల్యేలు జోగు రామన్న, రాథోడ్ బాపురావు, మాజీ ఎంపీ నగేశ్ హాజరయ్యారు. ముందుగా విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగు రామన్న మాట్లాడుతూ… హక్కుల సాధనకు పోరాడి అసువులు బాసిన రాంజీ గోండ్ త్యాగాలు మరువలేనివన్నారు. 1957 తిరుగుబాటులో సైతం కీలక పాత్ర పోషించారని బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీ, మున్సిపల్ ఫ్లోర్లీడర్ బండారి సతీశ్, రాంజీగోండ్ సంఘం నాయకులు భీంరావు, మంజుల, మారుతి, నాగోరావు, ఆశన్న తదితరులు పాల్గొన్నారు.
నిర్మల్ టౌన్, ఏప్రిల్ 9 : నిర్మల్ పట్టణంలోని వెయ్యి ఊడలమర్రి వద్ద రాంజీగోండ్ 161వ వర్ధంతిని ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించారు. పట్టణంలోని రాంజీగోండ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆదివాసీల హక్కుల కోసం పోరాడిన మహనీయుడు రాంజీగోండ్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన సంక్షేమశాఖ అధికారి శ్రీనివాస్రెడ్డి, తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు భూమయ్య, నాయక్పోడ్ సంఘం నాయకులు చిన్నయ్య, లక్ష్మణ్, శివశంకర్, సాయన్న, గోవింద్, మహేశ్, సాయి, భీమన్న పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
భూమిలో దొరికిన గుప్తనిధులు ఎవరికి సొంతం.. పంపకాలు ఎలా జరుపుతారు?
జబర్దస్త్ కామెడీ షోకి రష్మీ గౌతమ్ గుడ్ బై..?
కరోనా సెకండ్ వేవ్..ఇకపై వరుసగా వాయిదాలు చూడాలా..?
ఇంట్రెస్టింగ్ గా సిద్దార్థ్ ‘ఓరేయ్ బామ్మర్ది’ టీజర్