రామన్నపేట: రామన్నపేట అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికతో కృషి చేయనున్నట్లు నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. ఆదివారం రాత్రి పల్లెనిద్ర కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పట్టణ ప్రగతిపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి, అభివృద్ధి పనులపై చర్చించారు. రాష్ట్రప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ఆరా తీశారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అసంపూర్తిగా ఉన్న తరగతి గదులకు ఎస్టిమేట్ వేయాలని పీఆర్ఏఈని ఆదేశించారు. మండల కేంద్రంలో మరో రెండు వైకుంఠ ధామాలు నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు తెలిపారు.
సుభాశ్ రోడ్డు నుంచి మత్స్యగిరి చౌరస్తా వరకు డబుల్ రోడ్డు నిర్మాణంతో పాటు డివైడర్, లైటింగ్ ఏర్పాట్లపై చర్చించారు. పల్లె ప్రగతి పనులపై చర్చింంచారు. అనంతరం అధికారులతో కలిసి పల్లె నిద్ర చేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో జలేందర్రెడ్డి, తహాసీల్దార్ ఆంజనేయులు, పీఆర్ఏఈ గాలయ్య, విధ్యుత్శాఖ ఏఈ నర్సింహా, ఏపీవో వెంకన్న, పీఏసీఎస్ చైర్మన్ నంద్యాల భిక్షంరెడ్డి, ఎంపీటీసీలు గొరిగే నర్సింహా, ఎండీ రేహాన్, మండల కార్యదర్శి కంభంపాటి శ్రీనివాస్, బందెల రాములు, కన్నెబోయిన బలరాం, గోదాసు పృథ్వీరాజ్, పోతరాజు సాయికుమార్, ఆమేర్ పాల్గొన్నారు.