హైదరాబాద్ : బ్రేక్డౌన్స్, ఎమర్జెన్సీ సర్వీసులకు హాజరయ్యే ఉద్యోగులు కొవిడ్-19 భద్రతా నిబంధనలు పాటించాల్సిందిగా నార్తరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (ఎన్పీడీసీఎల్) చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ) ఎ. గోపాల్ రావు బుధవారం తెలిపారు. అదేవిధంగా ఎన్పీడీసీఎల్ పరిధి 17 జిల్లాల్లోని అన్ని వర్గాల వినియోగదారులకు విద్యుత్ సరఫరా రౌండ్-ది-క్లాక్ ఉండేలా చూడాలని ఆయన ఉద్యోగులకు సూచించారు.
విద్యుత్ బిల్లును పొందటంలో వినియోగదారులు విఫలమైతే సంబంధిత సిబ్బంది రెండు రోజులు వేచి ఉండి, టీఎస్ఎస్పీడీసీఎల్ యాప్ ఉపయోగించి ప్రత్యేకమైన సేవా నంబర్ ద్వారా బిల్లును వినియోగదారునికి పంపించాలన్నారు. బిల్లులు చెల్లించడానికి కౌంటర్లలో క్యూలలో నిలబడటానికి బదులుగా వినియోగదారులు ఆన్లైన్ సేవలను ఉపయోగించుకోవాల్సిందిగా కోరారు. కరోనా వైరస్ వ్యాప్తిని నివారించేందుకు విద్యుత్ విభాగానికి సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. మరింత సమాచారం కోసం వినియోగదారులు 18004250028 లేదా 1912 కు కాల్ చేయొచ్చన్నారు.
కొవిడ్ను ఎదుర్కోవటానికి చేసే పోరాటంలో నిరంతరాయ విద్యుత్ సరఫరా ముఖ్యమైన అవసరం కనుక, అన్ని విద్యుత్ ప్లాంట్లలోని అన్ని వర్గాల వినియోగదారులకు 24 × 7 విద్యుత్ సరఫరా కార్యకలాపాలను కొనసాగించాలన్నారు. అన్ని ఉత్పాదక స్టేషన్లు అత్యవసర పరిస్థితులను జాగ్రత్తగా చూసుకోవడానికి సంబంధిత చీఫ్ ఇంజనీర్ల నేతృత్వంలో కంట్రోల్ రూంలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. రాబోయే కొద్ది రోజులు చాలా కీలకమైనవని కావునా అధికారులు అవసరమైన అన్ని సామాగ్రిని, విడిభాగాలను ముందుగానే ప్లాన్ చేసి సేకరించి పెట్టుకోవాలన్నారు. 15 రోజుల అవసరాన్ని తీర్చేలా వీటి సేకరణ ఉండాలన్నారు.