హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో స్మార్ట్ ప్రీ పెయిడ్ విద్యుత్తు మీ టర్ల ఏర్పాటుకు త్వరలోనే విద్యుత్ నియంత్రణ మం డలి (టీఎస్ఈఆర్సీ) ఉత్తర్వులు జారీ చేయనున్నది. ఎన్పీడీసీఎల్, సిరిసిల్ల సెస్ పరిధిలో వీటిని బిగించనున్నా రు. కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ గురువారం నిర్వహించిన ఫోరం ఆఫ్ రెగ్యులేటర్స్ సమావేశంలో ప్రీ పెయిడ్ మీటర్ల ఏర్పాటుపై చర్చించారు. విద్యుత్తు సరఫరా, పంపిణీల్లో సాంకేతిక, వాణిజ్యపరంగా అత్యధిక (ఏటీ అండ్ సీ) నష్టాలు (15 శాతంకంటే ఎక్కువ) ఉన్న ప్రాంతాల్లో ని వినియోగదారులకు, రాష్ర్టాల్లోని ప్రభుత్వ భవనాలకు స్మార్ట్ ప్రీ పెయిడ్ మీటర్ల ఏర్పాటును 2023 డిసెంబర్లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. వీటి ఏర్పాటుకు రాష్ర్టాల అనుమతి లేకుండానే ఈఆర్సీలు ఉత్తర్వులు జారీచేస్తా యి. డిస్కంలు వెంటనే అమలుచేయాల్సి ఉంటుంది. రాష్ట్రంలో ఎన్పీడీసీఎల్, సిరిసిల్ల సెస్లను ఎంపికచేశా రు. గడువులోపు ప్రీపెయిడ్ మీటర్లను ఏర్పాటుచేయకుంటే కేంద్రం గ్రాంట్స్ నిలిపివేస్తుంది. వీటి ఏర్పాటువల్ల వినియోగదారులపై భారం పడకుండా చూస్తారు. ఈ ప్రాంతంలో కొత్త విద్యుత్తు కనెక్షన్లకు మొత్తం స్మార్ట్ ప్రీ పెయిడ్ మీటర్లనే ఏర్పాటుచేస్తారు.
సెల్ఫోన్లాగే విద్యుత్తు రీచార్జ్
స్మార్ట్ ప్రీ పెయిడ్ మీటర్లు సెల్ఫోన్లు, డీటీహెచ్లాగా ఆన్లైన్లో రీచార్జ్ చేసుకునేలా రూపొందించారు. ఇం దుకోసం కార్డు ఉంటుంది. దానిని మీటర్లో పెడితే అప్పటివరకు ఎంత విద్యుత్తు వాడారు? ఎంత బ్యాలె న్స్ ఉన్నది? అనే వివరాలను మీటరల్లో ఉండే మానిటర్పై చూపిస్తుంది. కార్డుపై రీచార్జ్ చేసిన డబ్బు అయిపోగానే విద్యుత్ సరఫరా ఆగిపోతుంది. డబ్బు పూర్తిగా అయిపోకముందే రీచార్జ్ చేసుకొంటే ఆ సమస్య ఉండదు. ఆన్లైన్లో పేటీఎం, బిల్ డెస్క్, టీ వాలెట్ తదితర యాప్ల ద్వారా రీచార్జ్ చేసుకోవచ్చు.