హైదరాబాద్ : రాష్ట్ర మంత్రివర్గం ఇటీవల ఆమోదం తెలిపిన కొత్త మెడికల్, నర్సింగ్ కాలేజీలకు పోస్టులు మంజూరయ్యాయి. ఒక్కో కాలేజీకి 1,001 పోస్టుల చొప్పున ఏడు మెడికల్ కాలేజీలకు 7,007 పోస్టులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రొఫెసర్లు, వైద్యులు, టెక్నిషీయన్లు, ఫార్మసిస్టులు, ఇతర పోస్టులు మంజూరు అయ్యాయి. 13 కొత్త వాటితో పాటు జగిత్యాల, గాంధీ నర్సింగ్ కాలేజీలకు కూడా పోస్టులు మంజూరు చేసింది ప్రభుత్వం. ఒక్కో నర్సింగ్ కాలేజీకి 48 చొప్పున 720 పోస్టులు మంజూరయ్యాయి.
మహబూబాబాద్, సంగారెడ్డి, జగిత్యాల, నాగర్కర్నూలు, వనపర్తి, కొత్తగూడెం, మంచిర్యాలలో నూతనంగా మెడికల్ కాలేజీల నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం విదితమే. తెలంగాణ రాకముందు ఇక్కడ కేవలం 4 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండేవి. కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత 5 కొత్త కాలేజీలు ఏర్పాటు చేశారు. తాజాగా మరో 7 కాలేజీల నిర్మాణానికి అనుమతి ఇవ్వడంతో.. రాష్ట్రంలో మెడికల్ కాలేజీల సంఖ్య 16 కు చేరింది