హైదరాబాద్, జూన్ 2 (నమస్తే తెలంగాణ): పలుకోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఎంసెట్ సహా మరికొన్ని పరీక్షలు వాయిదాపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వార్షిక పరీక్షలు పూర్తికాకపోవడంతో వీటన్నింటినీ వా యిదావేయాలని ఉన్నత విద్యామండలి అధికారులు నిర్ణయించారు. పీఈసెట్ వాయిదాకు ఇప్పటికే నిర్ణయం తీసుకోగా, ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో మిగతా వాటిని సైతం వాయిదావేస్తూ ఉన్నత విద్యామండలి అధికారులు త్వరలోనే అధికారిక ప్రకటన చేయనున్నారు. బీపీఈడీ, యూజీడీపీఈడీ కోర్సు ల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకున్నవారికి ఈ నెల 7 నుంచి ఫిజికల్ టెస్ట్లను నిర్వహించాలి. డిగ్రీ పరీక్షలు పూర్తికాకపోవడంతో దరఖాస్తుల గడువును ఈ నెల 5దాకా పొడిగించారు. దీంతో ఈ టెస్ట్లను వాయిదావేస్తూ ఒకట్రెండు రోజుల్లో ప్రకటన చేయనున్నారు. ఎంఈ, ఎంటెక్ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ నెల 19న నిర్వహించాల్సిన పీజీఈసెట్ సైతం వాయిదాపడే అవకాశాలున్నాయి. బీటెక్ చివ రి ఏడాది పరీక్షలు పూర్తికాకపోవడం, మిడ్ ఎగ్జామ్స్ అదే సమయంలో ఉండటంతో వాయిదాపడనున్నది. జూలై 5 -9 వరకు జ రగాల్సిన ఎంసెట్ సైతం వాయిదాపడే అవకాశాలున్నాయి. ఇంటర్ పరీక్షలపై సందిగ్ధత కొనసాగుతుండటం, కరోనా నేపథ్యంలో ఎంసెట్ను వాయిదావేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈనెల 21 నుంచి హాల్ టి కెట్లు జారీచేయాల్సి ఉండగా, వాయిదాపై అధికారిక ప్రకటన వెలువడనున్నది.