కాళేశ్వరం, జూన్ 25: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని లక్ష్మి పంప్హౌస్ వద్ద ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ పనులు జోరుగా సాగుతున్నాయి. ప్రత్యేక డిజైన్లతో ఈ పనులు చేపడుతున్నారు. ప్రాజెక్టు సందర్శనకు వచ్చినప్పుడు సీఎం బస చేసేందుకు దీన్ని నిర్మిస్తున్నారు. అలాగే మంత్రులతో సమావేశాలు నిర్వహించేందుకు ప్రత్యేకంగా హాలు ఏర్పాటు చేస్తున్నారు. సుమారు రూ.10 కోట్ల్ల వ్యయంతో నాలుగు అంతస్తుల్లో క్యాంప్ ఆఫీస్ను సిద్ధం చేస్తున్నారు. దీని పక్కనే హెలికాప్టర్ దిగేందుకు అనువుగా హెలిప్యాడ్ కూడా నిర్మిస్తున్నారు. డిసెంబర్ వరకు పనులు పూర్తవుతాయని అధికారులు పేర్కొన్నారు.