హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ): ఎగవేతదారులకు అప్పులిచ్చేందుకే లాభాల్లో నడుస్తున్న పోస్టల్ రంగాన్ని ప్రైవేటీకరించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైందని నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఎంప్లాయీస్ కన్వీనర్ ఏ శ్రవణ్కుమార్ ఆరోపించారు. బడా కంపెనీల యాజమాన్యాలకు లబ్ధి చేకూర్చేందుకు నిర్ణయాలు తీసుకోవడం తగదని, ప్రైవేటీకరణను ఆపకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ.. మంగళవారం తెలంగాణ వ్యాప్తంగా భోజన విరామ సమయంలో తపాలా ఉద్యోగులు నిరసనలకు దిగారు. ఈ నెల 19 వరకు నిరసనలు చేపట్టనున్నట్టు శ్రవణ్కుమార్ తెలిపారు. చార్మినార్, ఖైరతాబాద్, ఉప్పల్లోని ప్రధాన పోస్టల్ కార్యాలయాలతోపాటు తెలంగాణ సర్కిల్ పరిధిలోని అన్ని పోస్టల్ కార్యాలయాల ఉద్యోగులు నిరసనలు చేపట్టారు.