హైదరాబాద్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ): పేదోళ్ల లాయర్గా పేరొందిన ప్రముఖ న్యాయవాది తరిమెల బాలిరెడ్డి (90) ఆదివారం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్లో తుదిశ్వాస విడిచా రు. జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో కుటుంబసభ్యులు అంత్యక్రియలు పూర్తిచేశారు. ఏపీలోని అనంతపురం జిల్లా శింగనమల మండలం జలాల్పురం ఆయన స్వగ్రామం. వృత్తి రీత్యా హైదరాబాద్లో స్థిరపడ్డారు. తొలుత సుప్రీంకోర్టు న్యాయమూర్తి చిన్నపరెడ్డి వద్ద జూనియర్గా పనిచేశారు. తర్వాత స్వతంత్రంగా న్యాయవాదవృత్తిని చేపట్టి, క్రిమినల్లా మీద పట్టు సాధించారు. పేదలు, ఖైదీలు తమకు న్యాయం చేయాలంటూ రాసే లేఖల ఆధారంగా వివరాలు తెప్పించుకొని, వారికి ఉచితంగా న్యాయసేవలు అందించేవారు. బాలిరెడ్డి మృతిపట్ల సంతాపం తెలిపిన పలువురు ప్రముఖులు.. ఆయన కుమారులు విజయ్కుమార్, నరేశ్కుమార్తోపాటు, మేనల్లుడు, జస్టిస్ కే సురేశ్రెడ్డిని పరామర్శించారు.