నర్సంపేట, మే 11: ప్రజలందరూ విధిగా కరోనా నిబంధనలు పాటించాలని కలెక్టర్ ఎం హరిత సూచించారు. మంగళవారం ఆమె ఆకస్మికంగా నర్సంపేట ఏరియా దవాఖానను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కరోనా లక్షణాలు ఉన్న వారు నిర్లక్ష్యం చేయకుండా మందులు వాడాలని కోరారు. ఆక్సిజన్ తక్కువైన వారు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే వెంటనే అందుబాటులో ఉండే ప్రభుత్వ దవాఖానలో చేరాలని సూచించారు. నర్సంపేట ఏరియా దవాఖానలో ఆక్సిజన్ సిలిండర్లు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. కరోనా బాధితుల కోసం 30 బెడ్స్ ఉన్నట్లు చెప్పారు. 45 ఏండ్లకు పైబడిన వారు టీకాలు వేసుకోవాలన్నారు. కార్యక్రమంలో నర్సంపేట ఆర్డీవో పవన్కుమార్, తహసీల్దార్ రామ్మూర్తి, ఆర్ఎంవో డాక్టర్ జాన్సన్, వైద్యులు పాల్గొన్నారు.
కొనసాగుతున్న వ్యాక్సినేషన్
భాంజీపేట పీహెచ్సీలో మంగళవారం టీకాలు వేసినట్లు వైద్యాధికారి భూపేశ్ తెలిపారు. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని, భౌతికదూరం పాటించాలని సూచించారు. శాయంపేట పీహెచ్సీలో 41 మందికి రెండో డోస్ టీకాలు వేసినట్లు వైద్యాధికారి నాగశశికాంత్ తెలిపారు. జడ్పీఎస్ఎస్లో 20 మందికి పరీక్షలు చేయగా, 10 మందికి పాజిటివ్ వచ్చిందని తెలిపారు. శాయంపేట మండల పరిధిలో పలువురు వైద్య సిబ్బంది కరోనా బారిన పడ్డారు. ఇప్పటికే ఐదుగురు క్వారంటైన్లో ఉండగా, తాజాగా మరో ఇద్దరికి పాజిటివ్ వచ్చినట్లు సిబ్బంది తెలిపారు. గీసుగొండ పీహెచ్సీకి మరియపురం సర్పంచ్ అల్లం బాలిరెడ్డి తన సొంత ఖర్చులతో 45 ఏళ్లకు పైబడిన వారిని వాహనంలో తరలించి టీకాలు వేయించారు. గీసుగొండ దవాఖానలో 34 మందికి కరోనా పరీక్షలు చేయగా, 8 మందికి పాజిటివ్ వచ్చినట్లు సీహెచ్వో మధుసూదన్రెడ్డి తెలిపారు. 70 మందికి వ్యాక్సిన్ వేసినట్లు చెప్పారు. ఆత్మకూరులో 60 మందికి పరీక్షలు చేయగా 24 మందికి పాజిటివ్ వచ్చినట్లు వైద్యాధికారి రణధీర్ తెలిపారు.