జమ్మికుంట, ఆగస్టు 2: ‘షబ్బీర్ మృతి దురదృష్టకరం. ఆయన చావును కొందరు నాయకులు రాజకీయం చేయటం సిగ్గుచేటు. వీలైతే బాధిత కుటుంబాన్ని ఆదుకుందాం. శవరాజకీయంతో లబ్ధిపొందాలనుకునే నాయకులకు ఇక్కడి దళితులు, ప్రజలే గుణపాఠం చెబుతారు’ అని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి ఆగ్ర హం వ్యక్తంచేశారు. కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం సిరిసేడుకు చెందిన షబ్బీర్ జమ్మికుంటకు చెందిన దళిత యువతి బండ రేష్మా(రేణుక)ను 10 నెలల క్రితం మతాంతర వివాహం చేసుకున్నాడు. అనంతరం జమ్మికుంటలోనే అద్దెకు ఉంటున్నాడు. ఆదివారం సాయంత్రం షబ్బీర్ జమ్మికుంటలో రైలుకింద పడి ఆత్మహత్య చేసుకొన్నాడు. సోమవారం షబ్బీర్ కుటుంబాన్ని ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్, నన్నపునేని నరేందర్తో కలిసి పల్లా పరామర్శించారు. మృతికి గల కారణాలు అడిగి తెలుసుకొని బాధితులను ఓదార్చారు. టీఆర్ఎస్ తరఫున రూ. 3 లక్షల నగదు షబ్బీర్ భార్య రేష్మాకు అందజేశారు. అనంతరం పల్లా మాట్లాడుతూ.. తాము బాధిత కుటుంబాన్ని ఆదుకునేందుకు వచ్చామే కానీ, రాజకీయం చేసేందుకు రాలేదని చెప్పారు. మతాంతర వివాహం చేసుకొన్న వీరిని కొందరు ఆదరించక పోవడం దురదృష్టకరమన్నారు. టీఆర్ఎస్ పార్టీ, ప్రభుత్వం రేష్మాకు అండగా ఉంటుందన్నారు.
దళితురాలినని ఆదరించలె
నేను దళితురాలినని షబ్బీర్ తల్లిదండ్రులు మమ్మల్ని ఆద రించలేదు. 10నెలల కిందట పెండ్లి చేసుకొన్న తర్వాత బతక డానికి హైదరాబాద్ పోయినం. లాక్డౌన్ వచ్చినంక మళ్లీ జమ్మికుంటకు వచ్చినం. షబ్బీర్ను వాళ్ల అవ్వ, అయ్య దళితురాలిని ఎందుకు పెండ్లి చేసుకున్నవని తిట్టిండ్రు, కొట్టిన్రు. పది నెలల్లో ఒక్కసారైనా కొడుకెట్లున్ననడని జూడలే. రోజూ శాపనార్థాలు పెట్టిండ్రు. ఏంజేసినా షబ్బీర్ నా దగ్గరికే వచ్చెటోడు. నాతోనే ఉండెటోడు. సొంతపోళ్లే పట్టించుకోకపోవడంతో షబ్బీర్ ఆగమైపోయిండు. – రేష్మా, షబ్బీర్ భార్య