సూర్యాపేట టౌన్, మే 12 : కరోనా బారిన పడి తీవ్ర అస్వస్థతకు గురైన తనకు పునర్జన్మనిచ్చింది సూర్యాపేట ప్రభుత్వ దవాఖాన వైద్యులేనని జిల్లా కాంగ్రెస్ ఓబీసీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ మద్ది శ్రీనివాస్యాదవ్ అన్నారు. కరోనా అంటేనే భయపడి పారిపోతున్న రోజుల్లో ఇక్కడి వైద్యలు, సిబ్బంది అద్భుత చికిత్స అందిస్తున్నారని కొనియాడారు. సూర్యాపేట హాస్పిటల్లో వసతులు కార్పొరేట్ను తలదన్నే రీతిలో ఉన్నాయని చెప్పారు. రాజకీయాల గురించి మాట్లాడటం సరికాదని, సూర్యాపేట దవాఖాన ఇంతటి స్థాయికి చేరిందంటే కారణం విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డే కారణమని స్పష్టంచేశారు. ఈ మేరకు ఆయన స్వయంగా మాట్లాడిన ఒక వీడియోను బుధవారం విడుదల చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.