బడంగ్పేట,జూన్4 : అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆటంకం కలుగకుండా చూడాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 28వ డివిజన్లో రూ.36లక్షల నిధులతో పలు అభివృద్ధి పనులకు, ఓపెన్ జిమ్, పార్కు, నీటి పైపులైన్, కమ్యూనిటీ హాల్కు శుక్రవారం మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కష్ట కాలంలో ప్రజలను కాపాడుకుంటూ అభివృద్ధి పనులు చేపడుతున్నామని అన్నారు. విపత్కాలంలో కూడా సంక్షేమ కార్యక్రమాలు ఆపలేదన్నారు. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాలతో ఇక్కడ ఓపెన్ జిమ్లు ఏర్పాటు చేశామని అన్నారు. కార్యక్రమంలో మేయర్ దుర్గా దీప్లాల్ చౌహా న్, డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్రెడ్డి, కమిషనర్ సుమన్ రావు, కార్పొరేటర్లు సిద్ధాల లావణ్య బీరప్ప, జిల్లెల అరుణ ప్రభాకర్రెడ్డి, వేముల నర్సింహ, అనిల్ కుమార్ యాదవ్, గజ్జల రాంచందర్, సిద్ధాల బీరప్ప, అక్కి మాధవి ఈశ్వర్ గౌడ్, కోఆప్షన్ సభ్యుడు పల్లె జంగయ్య గౌడ్, టీఆర్ఎస్ నాయకులు బాలప్ప, బండి నాగేశ్, ఎం.శ్రీను, దాసరి కిరణ్ తదితరులు ఉన్నారు.