పదవీకాలం పొడగింపు
ఆత్మకూరు(ఎం), జూన్6: ఉమ్మడి నల్లగొండ జిల్లా పశుగణాభి వృద్ధి సంస్థ చైర్మన్ మోతె పిచ్చిరెడ్డి పదవీకాలం మరో 2 సంవత్స రాలు పొడగిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసిందని డీఎల్డీఏ చైర్మన్ మోతె పిచ్చిరెడ్డి తెలిపారు. ఆదివారం మండలంలోని కూ రెళ్లలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లా డుతూ తన పదవీకాలం మే 31న పూర్తైందని రాష్ట్రంలోనే ఉమ్మ డి నల్లగొండ జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ అభివృద్ధిలో మొదటి స్థానంలో నిలిచిందన్నారు. 2 సంవత్సరాల పాటు పదవీ కాలా న్ని పొడిగించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్కు, మంత్రి జగదీశ్ రెడ్డికి, టీఎస్ఎల్డీఏ చైర్మన్ రాజేశ్వర్రావు, ప్రభుత్వ విప్ గొంగి డి సునీతామహేందర్రెడ్డి, ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని శాసన సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో టీఆర్ఎస్ మం డలాధ్యక్షుడు భాషబోయిన ఉప్పలయ్య, రైతుబంధు సమితి గ్రామ కో ఆర్డినేటర్ కొత్తోజు యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు.