కరోనా కట్టడికి ప్రభుత్వం విధించిన లాక్డౌన్ 5వ రోజు విజయవంతంగా కొనసాగింది. సిద్దిపేట జిల్లా కేంద్రంతో పాటు సిద్దిపేట అర్బన్, రూరల్, చిన్నకోడూరు, నంగునూరు, నారాయణరావుపేట మండలాల్లో లాక్డౌన్ కొనసాగుతోంది. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు ప్రజలు నిత్యావసరాలను కొనుగోలు చేస్తున్నారు. మినహాయింపు సమయాల్లో ప్రజలు రోడ్లపైకి వస్తుండడంతో రద్దీ కనిపిస్తుంది. మటన్, చికెన్ సెంటర్లన్నీ సందడిగా మారాయి. 10 తరువాత రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపించాయి.
జాగ్రత్తలు పాటిస్తే మేలు
మినహాయింపు సమయంలో ప్రజలు భౌతిక దూరం పా టించాలి. ముఖానికి మాస్క్లు తప్పకుండా ధరించాలి. చేతులను ఎప్పటికప్పుడు సబ్బుతో లేదా, శానిటైజర్తో శుభ్రం చేసుకుంటే మంచిది. అవసరం లేకున్నా రోడ్లపైకి రావడం వారి ఆరోగ్యానికి శ్రేయస్కరం కాదు.
పోలీసుల బందోబస్తు
లాక్డౌన్ విజయవంతానికి పోలీసులు కట్టిదిట్టమైన బందోబస్తు చేపట్టారు. ప్రధాన కూడళ్లలో పికెటింగ్లు ఏర్పాటు చేసి ఉదయం 10 గంటల తరువాత జనం రోడ్లపైకి రాకుండా చూ స్తున్నారు. ఎవరైనా వస్తే ఆరా తీస్తూ కౌన్సెలింగ్ ఇచ్చి పంపిస్తున్నారు. అనవసరంగా వస్తే కేసులు నమోదు చేస్తున్నారు.
గ్రామాల్లో సంపూర్ణంగా లాక్డౌన్
సర్కార్ విధించిన లాక్డౌన్ చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, ధూళిమిట్ట మండలా ల్లో పటిష్టంగా అమలతున్నది. ఈ మేరకు పోలీసులు విస్తృతంగా పర్యటిస్తున్నారు. గ్రామాల్లో ప్రజలు గుంపులుగా ఉండకుండా సర్పంచ్లు చర్యలు తీసుకుంటున్నారు. హుస్నాబాద్ డివిజన్లో హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ, బెజ్జంకి మం డలాల్లో 10గంటల అనంతరం అంతా నిర్మానుష్యంగా మా రింది. లాక్డౌన్ పూర్తిగా అమలవుతుండడంతో కరోనా అదు పులోకి వస్తుందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.