అలంపూర్: జోగులాంబ గద్వాల జిల్లా సరిహద్దుల్లోని పుల్లూరు టోల్ప్లాజా వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ముందస్తు అనుమతికి సంబంధించిన ఈ-పాస్ లేకపోవడంతో ఆంధ్రప్రదేశ్కు నుంచి వస్తున్న వాహనాలను టోల్ గేట్ వద్ద పోలీసులు ఆపివేస్తున్నారు. ఈ-పాస్ ఉన్న వాహనాలను మాత్రమే రాష్ట్రంలోకి అనుమతిస్తున్నారు.
కరోనా వైరస్ వ్యాప్తిని నిలువరించడానికి రాష్ట్రంలో లాక్డౌన్ అమలుచేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అత్యవసర, నిత్యావసర వాహనాలను మినహా.. ఇతర వాహనాలు తిరగడానికి పోలీసులు ఈ-పాస్ను తప్పనిసరి చేశారు. దీంతో ముందస్తు అనుమతి లేని వాహనాలను రోడ్లపై తిరగడానికి అనుమతించడంలేదు.