ఎమ్మెల్యే బీరం హరవర్ధన్రెడ్డి
చిన్నంబావి, ఏప్రిల్ 28 : గ్రామీణప్రాంతాల్లో కరోనా వైరస్ విస్తరిస్తుంన్నదున ప్రతిఒక్కరూ విధిగా మాస్కులు ధరించి, భౌతికదూరం పాటిస్తూ కరోనాను పారదోలుదామని ఎమ్మెల్యే బీరంహర్షవర్ధన్రెడ్డి అన్నారు. చిన్నంబావి మండలంలో వివిధ కారణాలతో మృతి చెందిన కుటుంబాలను బుధవారం ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి పరామర్శించారు. పెద్దదగడ గ్రామానికి చెందిన సీనియర్ నాయకులు ఇంద్రసేనారెడ్డి సతీమణి మాజీసర్పంచ్ ప్రభావతమ్మ అనారోగ్యంతో మృతిచెందడంతో ఇంద్రసేనారెడ్డిని పరామర్శించి వారి కుటంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. చిన్నంబావి ఎంపీపీ సోమేశ్వరమ్మ మాతృవియోగం చెందడంతో పెద్దమరూరులో ఎంపీపీ ఇంటికి వెళ్లి పరామర్శించారు. పెద్దమరూరు గ్రామానికి చెందిన బయోటెక్ విద్యాసంస్థల అధిపతి డీకే విశ్వనాథ్ మృతిచెందడంతో వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గజ్జె ఈదన్నయాదవ్, నాయకులు శ్రీధర్రెడ్డి, ఈశ్వర్రెడ్డి, చిన్నారెడ్డి పాల్గొన్నారు.
మహాత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహావిష్కరణ
మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మహాత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహాన్ని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు ఫూలే జీవితం నాటి నుంచి నేటి వరకు ఆదర్శవంతమైనదన్నారు. విద్య వలననే సమాజంలో మార్పు జరుగుతుందని నమ్మిన వ్యక్తి అని పేర్కొన్నారు. కుల మత రహిత సమాజమే లక్ష్యంగా ఆయన కృషి చేశారన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కమలేశ్వర్రావు, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు కృష్ణయ్య, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సత్యనారాయణగౌడ్, సర్పంచ్ నర్సింహా రెడ్డి, ఎంపీటీసీ భాస్కర్రెడ్డి, మహాత్మాజ్యోతిరావు కమిటీ సభ్యులు రాము, ఎల్లేశ్, నాగరాజు పాల్గొన్నారు.