సిద్దిపేట, జూన్ 5(నమస్తే తెలంగాణ ప్రతినిధి): దేశంలో ఆయిల్పామ్కు మంచి డిమాండ్ ఉన్నదని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు తెలిపారు. శనివారం సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం రామచంద్రాపూర్లో రైతు నర్సింహారెడ్డి వ్యవసాయ భూమి లో ఆయిల్పామ్ సాగుకు మంత్రి శ్రీకారం చుట్టారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజా రాధాకృష్ణశర్మ, ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, సీఎంవో ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్ తో కలిసి మంత్రి ఆయిల్పామ్ మొక్కను నాటారు. అనంతరం సిద్దిపేటలో జనసహాయకులకు వ్యాక్సినేషన్ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. పామాయిల్ కొరత దేశంలో తీవ్రంగా ఉన్నదన్నారు. దాదాపు 9లక్షల మిలియన్ టన్నుల నూనె ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నట్టు చెప్పారు. మన దేశంలో కేవలం 8.25 లక్షల హెక్టార్లలో మాత్రమే సాగవుతుందన్నారు. దేశ అవసరాలకు సరిపడా ఉత్పత్తి చేయాలంటే ఇంకా 70 లక్షల ఎకరాల్లో ఆయిల్పామ్ తోటలు సాగు చేయాల్సి ఉన్నదన్నారు. పామాయిల్కు బహిరంగ మార్కెట్లో మంచి డిమాం డ్ ఉన్నదని తెలిపారు. రైతులకు గిట్టుబాటు ధర అం దించేలా.. అన్ని రకాల ప్రోత్సాహకాలు కల్పించడానికి ప్రభుత్వం సిద్ధ్దంగా ఉన్నదని తెలిపారు. రాష్ట్రంలో ఎనిమిది లక్షల ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారన్నారు.
టీకాల పంపిణీలో కేంద్రం విఫలం
వ్యాక్సిన్ల విషయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని మంత్రి హరీశ్రావు విమర్శించారు. వ్యాక్సిన్లు దిగుమతి చేసుకునే అవకాశం రాష్ర్టాలకు ఇవ్వాలని కోరారు. టీకాల కొనుగోలుకు ఇప్పటికే ఆయా కంపెనీలకు తెలంగాణ ప్రభు త్వం రూ.100కోట్లు చెల్లించిందని మంత్రి తెలిపారు.