మన పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి..
హరితహారంతో నాలుగు శాతం అడవులు పెరిగాయి..
అంతర్గత, పామాయిల్ పంటలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి..
బ్రహ్మణ్గావ్ రైతు వేదిక ప్రారంభోత్సవంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
ముథోల్, జూలై 8 : రైతు సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా కేసీఆర్ ప్రభుత్వం పనిచేస్తున్నదని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. మండలంలోని బ్రహ్మణ్గావ్ గ్రామంలో రూ.25 లక్షల తో నూతనంగా నిర్మించిన రైతు వేదిక భవనాన్ని శుక్రవారం ఎమ్మెల్యే విఠల్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. ముఖ్యమంత్రి రైతుల పక్షపాతి అని పేర్కొన్నారు. రైతులకు ఒక వేదిక ఉండాలనే ఆలోచన తో రైతు వేదికలు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించా రు. తెలంగాణ ప్రభుత్వ పాలనలో రైతులు సంతోషంగా ఉండాలన్నదే ఆయన కల అని పేర్కొన్నా రు. నిర్మల్ జిల్లాలో ఇప్పటి వరకు 79 రైతు వేదికలు నిర్మించినట్లు వెల్లడించారు. రైతులు ఏవో, ఏఈవోలతో చర్చించిన అనంతరమే పంటలు వే సుకోవాలని సూచించారు. ఇక్కడి పథకాలను చూసి మహారాష్ట్ర నుంచి తెలంగాణలో చేరతామ ని దాదాపు 40 గ్రామాల ప్రజలు వచ్చినట్లు గుర్తుచేశారు. రైతులు పామాయిల్ పంటలపై దృష్టి సారి స్తే అధిక దిగుబడులు సాధించవచ్చన్నారు. బాసరలో త్వరలోనే ఇండస్ట్రీస్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. బాసర అభివృద్ధికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అవసరమైనన్ని ని ధులు మంజూరు చేసేలా చూస్తామన్నారు. 57 ఏండ్లు నిండిన వారికి వచ్చే నెల నుంచి వృద్ధాప్య పింఛన్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే విఠల్ రెడ్డి మాట్లాడుతూ.. ముథోల్ ని యోజకవర్గం భూ విస్తీర్ణంలో పెద్దదన్నారు. ప్రతి రైతుకూ మేలు జరిగేలా చూడడమే తమ బాధ్యత ని తెలిపారు. బ్రహ్మణ్గాంకు 32 డబుల్ బెడ్రూమ్లు మంజూరైనట్లు తెలిపారు. సర్పంచ్ రాంరెడ్డి పలు సమస్యలను మంత్రి, ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన వారు వాటి పరిష్కారానికి కృషి చేస్తామని హామీనిచ్చారు.
నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించాలి..
ఏడో విడుత హరితహరంలో భాగంగా నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని బ్రహ్మణ్గావ్, గన్నోరాలో ఎమ్మెల్యేతో కలిసి మొక్కలు నాటారు. హరితహరంలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఉండాలన్నారు. ఇప్ప టి వరకు 4 శాతం అడవులు పెరిగినట్లు తెలిపారు. ధరణి ద్వారా భూ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరికిందన్నారు. అనంతరం గన్నోరాలో ఉన్న దక్షిణమూర్తి హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజ లు చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మిని శాలువాతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మి రాంకిషన్ రెడ్డి, కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, రైతు బంధు సమితి జిల్లా కన్వీనర్ నల్లా వెంకట్ రాంరెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ సాగరాబాయి రాజన్న, ఆత్మ చైర్మన్ పోతారెడ్డి, సర్పంచ్ రాంరెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అఫ్రోజ్ఖాన్, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, రైతులు, టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.