కమలాపూర్, మే 1: ఈటల రాజేందర్పై భూ కబ్జాల ఆరోపణలతోపాటు వైద్య ఆరోగ్యశాఖను ముఖ్యమంత్రికి బదలాయించిన నేపథ్యంలో వరంగల్ అర్బన్ జిల్లాలోని ఆయన స్వగ్రామం కమలాపూర్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటుచేశారు. ఈటల అనుచరులు, అభిమానులు అల్లర్లకు పాల్పడుతారనే ఉద్దేశంతో శనివారం కాజీపేట ఏసీపీ ఆధ్వర్యంలో ఎల్కతుర్తి, హసన్పర్తి, కమలాపూర్ పోలీసులతో బందోబస్తు నిర్వహించారు.