హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అమర్నాథ్గౌడ్
మెదక్ అర్బన్, జూలై 11: చిన్నారులపై లైంగిక వేధింపులు, అత్యాచారం కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు మెదక్ జిల్లా న్యాయస్థాన సముదాయంలో ఏర్పాటు చేసిన పోక్సో కోర్టును ఆదివారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టీ అమర్నాథ్గౌడ్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పోక్సో చట్టంపై న్యాయవాదులు అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉన్నదన్నారు. లైంగిక నేరాల నుంచి బాలలను కాపాడటం, వారికి రక్షణ, సత్వర న్యాయం కల్పించేందుకు 2012లో బాలల రక్షణ చట్టం తెచ్చినట్టు చెప్పారు. కాగా పోక్సో కోర్టు న్యాయమూర్తిగా మైత్రేయి బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమంలో కలెక్టర్ హరీశ్, ఎస్పీ చందనదీప్తి తదితరులు పాల్గొన్నారు.