హైదరాబాద్, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ): ప్రముఖ పద్యకవి, దాశరథి అవార్డు గ్రహీత తిరునగరి రామానుజయ్య మృతి పట్ల ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా ఆలేరుకు చెందిన తిరునగరి ఆదివారం మృతిచెందారు. ఆయన సాహితీసేవను స్మరించుకున్న సీఎం.. తిరునగరి మరణం సాహితీలోకానికి తీరని లోటని అన్నారు. సంప్రదాయ సంస్కారాన్ని ఆధునిక విలువలను మేళవించి పద్యాన్ని, వచన కవితను సమవుజ్జీగా పండించిన తిరునగరి కవితాధార గొప్పదని పేర్కొన్నారు.