బీర్కూర్, ఆగస్టు 16 : రాష్ట్ర శాసన సభా స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. జలుబు, జ్వరం లక్షణాలు ఉండడంతో మంగళవారం ఆయన బాన్సువాడలో కొవిడ్ పరీక్ష చేయించుకోవడంతో పాజిటివ్గా వచ్చింది. దీంతో కొన్ని రోజులు సభాపతి హోం ఐసొలేషన్లో ఉండనున్నారు. కొన్ని రోజులుగా తనను కలిసిన, తనతో సన్నిహితంగా ఉన్న వారందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ఏమైనా లక్షణాలు ఉంటే కొవిడ్ టెస్ట్ చేయించుకోవాలని స్పీకర్ సూచించారు. సభాపతికి కరోనా సోకడం ఇది మూడోసారి.