ఒక్కోదాని నిర్మాణానికి రూ.5 కోట్లు
ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్
కలెక్టర్తో కలిసి స్థలాల పరిశీలన
హన్మకొండ/న్యూశాయంపేట, మార్చి 30 : మున్సిపాలిటీల్లో సమీకృత వెజ్, నాన్వెజ్ మార్కెట్ల నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. మంగళవారం ఆయన కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతుతో కలిసి నగరంలోని హంటర్రోడ్డు, బాలసముద్రం, బస్టాండ్ పక్కన ఉన్న కబేళా ఆవరణలోని స్థలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా చీఫ్విప్ మాట్లాడుతూ.. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో మూడు సమీకృత వెజ్, నాన్వెజ్ మార్కెట్ల నిర్మాణం కోసం ఇప్పటికే నక్కలగుట్ట, హంటర్రోడ్డు, బాలసముద్రంలోని ప్రభుత్వ స్థలాలను పరిశీలించినట్లు తెలిపారు. ఒక్కో మార్కెట్ను రూ.5కోట్లతో అన్ని హంగులతో నిర్మించనున్నట్లు చెప్పారు.
వరంగల్ పట్టణాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు మాట్లాడుతూ.. గ్రేటర్ మున్సిపాలిటీలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ల ఏర్పాటుకు అనువైన ప్రదేశాలను గుర్తించాలని ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రావడంతో పట్టణంలోని ప్రభుత్వ స్థలాలను పరిశీలించినట్లు తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉన్న స్థలాలను గుర్తించి ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కుడా టౌన్ప్లానింగ్ అధికారి అజిత్రెడ్డి, హన్మకొండ తహసీల్దార్ రాజ్కుమార్, కాజీపేట తహసీల్దార్ కిరణ్కుమార్, పాల్గొన్నారు.