హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా 216 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,00,933కు చేరింది. ఇందులో 2,97,363 మంది కరోనా నుంచి బయటపడగా, 1918 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. మరో 1652 మంది మరణించారు. కాగా, నిన్న కొత్తగా 168 మంది కోలుకుని డిశ్చార్జీ అవగా, ఇద్దరు మృతిచెందారు. మొత్తం యాక్టివ్ కేసుల్లో 794 మంది బాధితులు హోం ఐసోలేషన్లో ఉన్నారు. రాష్ట్రంలో రికవరీరేటు 98.81 శాతం ఉండగా, మరణాల రేటు 0.54 శాతంగా ఉన్నది. నిన్న ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 34,482 మందికి కరోనా పరీక్షలు చేశారు. దీంతో మొత్తం కరోనా పరీక్షలు 91,49,467కు చేరాయి.