హైదరాబాద్ : రేషన్ బియ్యాన్ని బ్లాక్మార్కెట్కు తరలిస్తున్న వ్యక్తులపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. నగరంలోని టోలీచౌకిలో నివాసం ఉంటున్న షేక్ మహబూబ్ (52) అనే వ్యక్తి లంగర్హౌజ్, టోలీచౌకి ప్రాంతాల్లోని రేషన్షాపులలో రేషన్ కార్డు మీద బియ్యం తీసుకున్న వినియోగదారుల నుంచి కిలోకు రూ.7 చొప్పున కొనుగోలు చేసి సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్లో రూ.12కు అమ్ముతున్నాడు.
సమాచారం అందుకున్న పౌరసరఫరాలశాఖ అధికారులు బంజారాహిల్స్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు జూబ్లీహిల్స్ రోడ్ నెం 87లో వాహనాల తనిఖీలు చేపట్టిన బంజారాహిల్స్ పోలీసులకు ఆటోలో తరలిస్తున్న 7 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆటోడ్రైవర్ షేక్ మహబూబ్ను అదుపులోకి తీసుకుని అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎవరైనా అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తే కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు.