చర్లపల్లి, మే 21 : నిరుద్యోగులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి పేర్కొన్నారు. కుషాయిగూడకు చెందిన కర్రె సత్యనారాయణకు మత్స్య శాఖ నుంచి మంజూరైన సంచార చేపల విక్రయ వాహనాన్ని శుక్రవారం ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి స్వయంగా నడిపి ప్రారంభించి తాళం చెవులను ఆయనకు అప్పగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని, ముఖ్యంగా యువత ఉద్యోగాల కోసం చూడకుండా ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విద్యావంతులైన నిరుద్యోగ యువతీ యువకులు ముందుకు వస్తే వారికి ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రోత్సహిస్తుందన్నారు.
నియోజకవర్గం పరిధిలో నెలకొన్న సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు నిధులు కేటాయించి పనులు చేపడుతున్నామని ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. శుక్రవారం చర్లపల్లి డివిజన్ పరిధిలోని శివసాయినగర్ ఫేజ్-3 నాలాపై బ్రిడ్జి నిర్మాణానికి రూ. 50లక్షల నిధులు మంజూరు, కుషాయిగూడ భాగ్యనగర్, అరుంధతి కాలనీలో తాగునీటి పైపులైన్ నిర్మాణ పనులకు రూ. 94లక్షల నిధులు కేటాయించడంతో కాలనీవాసులు ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డిని కలిసి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో చర్లపల్లి సీసీఎస్ ప్రతినిధి ఎంపెల్లి పద్మారెడ్డి, టీఆర్ఎస్ డివిజన్ ప్రధాన కార్యదర్శి డప్పు గిరిబాబు, అరుంధతి కాలనీ, శివసాయినగర్ కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు వెంకటేశ్, చంద్రమౌళి, విజయ, నాయకులు కర్రె సత్యనారాయణ, నాయకులు గిరక సుధాకర్, సత్యం యాదవ్, అరుణ, పురుషోత్తంరెడ్డి, సీత, హనుమంత రావు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
చర్లపల్లి డివిజన్ పరిధిలోని పలు కాలనీల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ డివిజన్ టీఆర్ఎస్ నాయకులు శుక్రవారం ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి మాట్లాడుతూ.. డివిజన్లో డ్రైనేజీ సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవడంతో పాటు తాగునీటి సమస్యను పూర్తి స్థాయిలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అదేవిధంగా, భరత్నగర్ రైల్వే క్రాసింగ్ ఆర్ఓబీ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయడంతో పాటు రైల్వే గేటు సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు.
ఉప్పల్, మే 21 : ఆపదలో ఉన్నవారికి అండగా నిలిచి, వారిని ఆదుకోవడమే నిజమైన సేవ అని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. ఉప్పల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో కొవిడ్ బారిన పడిన పేద కుటుంబాలకు 11 రకాల ఆహార వస్తువులు, ఐదు రకాల ఆరోగ్య వస్తువులను మారి సంస్థ (భారత గ్రామ నవ నిర్మాణ సంస్థ) ఆధ్వర్యంలో బీరప్పగడ్డలోని మాడల్మార్కెట్ కొవిడ్ టెస్టు కేంద్రం ప్రాంతంలో శుక్రవారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి, చిలుకానగర్ కార్పొరేటర్ బన్నాల గీతాప్రవీణ్ ముదిరాజ్ హాజరై కొవిడ్ బాధితులకు అందజేశారు. కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ నారాయణ, డీసీ అరుణకుమారి, మెడికల్ ఆఫీసర్ సౌందర్యలత, సూపర్వైజర్ ప్రకాశ్, మారి ఈడీ ఆర్.మురళీ, పీహెచ్సీ కో ఆర్డినేటర్ మాసాని వెంకన్న, ప్రవళిక, బిందు, టీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్, గడ్డం రవికుమార్, సంతోష్, పల్లె నర్సింగ్రావు, ఎదుల్ల కొండల్రెడ్డి, గరిక సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
కొవిడ్ టెస్టు చేయించుకున్న ఎమ్మెల్యే బేతి..
బీరప్పగడ్డలోని కొవిడ్ టెస్టు కేంద్రంలో ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి శుక్రవారం కరోనా ర్యాపిడ్ టెస్టు చేయించుకున్నారు. ఎమ్మెల్యేకు నెగిటివ్గా వచ్చిందని కేంద్రం నిర్వాహకులు తెలిపారు.