వరంగల్ అర్బన్ : వరంగల్ నగరంలోని చారిత్రక ప్రసిద్ధి గాంచిన భద్రకాళీ ఆలయంలో వసంత నవరాత్రి ఉత్సవాల సందర్భంగా బుధవారం అమ్మవారికి లక్ష మల్లె పూలతో అర్చన గావించారు. ఉదయం సుప్రభాతసేవ, నిత్యాహ్నికం జరిపిన అనంతరం జపహోమార్చనాభిషేకం నిర్వహించారు.
ఆదిదేవత విష్ణువు, పరమాత్మ చైతన్యం సత్వగుణ ప్రధానమైన వైష్ణవీ శక్తి విష్ణువు రూపంలో ఉండి ఈ లోకాన్ని పరిపాలిస్తూ రక్షిస్తున్నారని, తెలుపు సత్వగుణానికి ప్రతీక కాబట్టి అమ్మవారిని తెలుపు వర్ణానికి చెందిన మల్లెపూలతో అర్చన చేశామని ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు వివరించారు. ఈ సందర్భంగా భక్తులు కొవిడ్ నిబంధనలను అనుసరించి అమ్మవారిని దర్శించుకున్నారు.
ఇవి కూడా చదవండి..
జ్ఞానాన్ని ఎల్లలు దాటించిన అంబేద్కర్: మంత్రి హరీశ్
ఖమ్మంలో ఆక్సిజన్ ఉత్పత్తి సెంటర్ ప్రారంభం
IPL 2021: అభిమానులకు షారుక్ ఖాన్ క్షమాపణ
అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి పువ్వాడ