హైదరాబాద్, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో జీహెచ్ఎంసీ సహా అన్ని పట్టణ స్థానిక సంస్థల పరిధిలో ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్పై నిషేధం అమలుపై రాష్ట్ర పురపాలక శాఖ దృష్టిపెట్టింది. 75 మైక్రాన్ల కన్నా తక్కువ మందం ఉన్న సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించేందుకు గురువారం నుంచి వచ్చే ఏడాది జనవరి 30వ తేదీ వరకు కార్యాచరణ ప్రణాళికను విడుదల చేసింది.