ప్రభాస్, పూజా హెగ్డే ప్రధాన పాత్రలలో జిల్ ఫేం రాధాకృష్ణ కుమార్ తెరకెక్కించిన చిత్రం రాధే శ్యామ్. ఇటలీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని జూలై 30న విడుదల చేయబోతున్నట్టు కొద్ది రోజుల క్రితం ప్రకటించారు. కృష్ణంరాజు సమర్పణలో యూవీ క్రియేషన్స్ – గోపీకృష్ణ బ్యానర్స్ పై వంశీ – ప్రమోద్ – ప్రసీద ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ పెద్దగా అప్డేట్స్ ఇవ్వకపోతుండడంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.
సినిమా రిలీజ్కు సరిగ్గా రెండున్నర నెలల సమయమే ఉంది. అయినప్పటికీ మూవీకి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ఇవ్వడం లేదు. దీంతో ఆగ్రహానికి గురైన ప్రభాస్ ఫ్యాన్స్ యూవీ క్రియేషన్స్ను పెద్ద ఎత్తున ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. ట్విట్టర్ లో ‘నిద్ర లే యూవీ క్రియేషన్స్’ అంటూ హ్యాష్ ట్యాగ్ తో నెగెటివ్ ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారు. ఈ హ్యాష్ ట్యాగ్ నేషనల్ వైడ్గా ట్రెండ్ అవుతుంది. ప్రస్తుతం రాధేశ్యామ్ సలార్, ఆదిపురుష్ చిత్రాలతో బిజీగా ఉన్నాడు. జూన్ నుండి నాగ్ అశ్విన్ మూవీ మొదలు పెట్టనున్నట్టు టాక్.