హైదరాబాద్ : రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు ఈ రోజు తన పుట్టినరోజును పురస్కరించుకుని గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పచ్చదనం పెంచడం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. పుట్టినరోజు సందర్భంగా సంతోష్ కుమార్ పిలుపు మేరకు మొక్కలు నాటడం చాలా ఆనందంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఇదేవిధంగా మొక్కలు నాటాలని తన నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చానని ఆయన తెలిపారు. తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన ఎంపీ సంతోష్ కుమార్కు కృతజ్ఞతలు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
ఉపాధి కోసం వెళ్తూ..మృత్యు ఒడిలోకి
ఆకలికేకల తెలంగాణ అన్నపూర్ణగా మారింది
లాక్డౌన్తో కరోనా తగ్గుముఖం : స్పీకర్ పోచారం
రైతుల శ్రేయస్సే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం
అశ్విన్ ఆల్టైమ్ గ్రేట్స్లో ఒకడు కానే కాదు: మంజ్రేకర్
తాండ్రియాల్లో తక్షణమే ధాన్యాన్ని సేకరించాలి